పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

30, ఏప్రిల్ 2018, సోమవారం

శ్రీ శ్రీ గారి జయంతి

శ్రీశ్రీ నాటిన అభ్యుదయ
  సాహితీ వనంలో .. 
నే గడ్డిపూవునయినను చాలు
ఆ రేడు నడిచిన దారిలో......
ఇసుక రేణువునయినను చాలు
ఆ అభీకుని కలం విదిల్చిన
సిరా బొట్టు నయిననూ  చాలు
ఆ మహనీయుని కలానజారిన కవనంలో ....... 
నేనొక అక్షరమయిననూ చాలు
ఆ దార్శనికుని కవితా కడలిలో   చిన్ని అలనయినా చాలు
భాదిత జనాల బాసట  నిలువగ,
పీడిత జనాలకూపిరులూదగ ,
కవి తలపెట్టిన మహాయజ్ఞం
కొనసాగించుటకై ,
నే ఉడత సాయమందిస్తా ... 
సమ సమాజ స్థాపనలో ,నా
చిరు కవితాబాణం సంధిస్తా .... 
(మహాకవిశ్రీశ్రీగారిజయంతిసందర్భంగా నివాళులర్పిస్తూ....)
               
                              శ్రీమణి

29, ఏప్రిల్ 2018, ఆదివారం

భూమిపుత్రా...

భూమిపుత్రా...
నీకు బువ్వ కరువాయెనా?
అన్నదాతా...
నీదు గుండె బరువాయెనా?
క్షేత్రమిత్రా...నీ బ్రతుకు
కన్నీటి చెరువాయెనా
రోజంతా ఊడిగమై
గానుగెద్దు జీవితమై
మట్టిని నమ్మిన నీకు
వెట్టిచాకిరీ మిగిలి
నీ స్వేదం ధారపోసి
నీ సత్తువ కూడదీసి
సేధ్యంచేసిన నీకు
వేదనే...వరమాయెనా?
చితికినబ్రతుకుకు
అతుకులు వేస్తూ
చితికిచితికి ఛితికి
చేరువై
బ్రతుకుబండి లాగలేక
నీడొక్కలెండి పోయెనా?
పుట్టినూరులో సైతం
పట్టెడన్నం పుట్టక
పుట్టెడు అప్పులపాలై
పొట్ట చేతపట్టుకోని
తినడానికి తిండిలేక
నిలుచుందుకు నీడలేక
ఏడ్వలేక,నవ్వలేక
ఓదార్చే వారులేక
అంతిమపోరాటంలో
ఆత్మహత్యనే ఎంచుకు
నేల ఋణం త్రుంచుకు పోతున్నావా....😥
(ఆకలిచావులు,
చీకటితావుల్లో
అప్పులపాలై
అతలాకుతలమై
ఆత్మహత్యలు
చేసుకొంటున్న
రైతన్నల బ్రతుకులను
చూసి చలించి రాసుకొన్న కవనం)........శ్రీమణి

27, ఏప్రిల్ 2018, శుక్రవారం

తెలుగుదీప్తి పురస్కారం

ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సృజనాత్మక శాఖ మరియు తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న
తెలుగు కళా వేదిక, కడప
ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా

"గౌరవ శ్రీ నందినీ సిద్ధారెడ్డి
(తెలంగాణ సాహిత్య అకాడెమీ అధ్యక్షులు) మరియు
కళారత్న శ్రీ పొట్లూరి హరికృష్ణ
(తెలుగు రక్షణవేదిక జాతీయ అధ్యక్షులు)  గారి నుండి
"తెలుగు దీప్తి పురస్కారం"
స్వీకరించుచున్న శుభతరుణం..

24, ఏప్రిల్ 2018, మంగళవారం

మేఘసందేశం

​మెరిసేమేఘం
సందేశం విని
కురిసేచిటపట
చినుకులకనుగొని
రమ్మని,రారమ్మని
పిల్లతెమ్మెర
కమ్మని కబురంపింది
కొమ్మల్లో కోయిలమ్మకు,
కొత్తరాగమాలపించమని,
ఆజడివానల
జతులాడగ
హొయలారబెట్టుకుంది
పురివిప్పి
ఆమయూరం
వయ్యారంగా...
ముసిరిన మేఘమాల
సోయగాలు చూసి
మూగబోయింది
ముద్దబంతి పూలరెమ్మ
సంతసానసంతకాలు
చేసింది...సాగరతీరంపై
ఆమలయసమీరం
ఆ మధుర ఘడియలు
తడిమి చూసి
తన్మయమై
తరుణీమణి
మది మకరందం
చవిచూసింది
మధురోహల
పరిమళాల
మైమరపులలో...
 
          ​శ్రీమణి​

22, ఏప్రిల్ 2018, ఆదివారం

జాతీయయువ సేవాపురస్కారం అందుకొన్న శుభసందర్భం

ఆంధ్రప్రదేశ్ క్రియేటివిటీ & కల్చరల్ కమీషన్,
ఆంధ్ర సారస్వత పరిషత్తు మరియు
తెలుగు రక్షణ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో
"జాతీయ యవసేవా పురస్కారం" 2018 అందుకున్న శుభతరుణం
వేదిక: జిల్లా పరిషత్ సమావేశ మందిరం, విశాఖపట్నం.

17, ఏప్రిల్ 2018, మంగళవారం

కకావి"కలం"

కరం కదలకుంటుంది
కలం కదలనంటుంది
కల అయితే బావుణ్ణని
గుండె కలవరిస్తోంది
కకావికలమవుతోంది
కనులు మూసినా
కనులుతెరచినా
చిన్నారి ఆసిఫా
కన్నీటిప్రతిరూపం
కడుదీనంగా
కదలాడుతుంది
నిన్నటి
కటికచేదువిషమింకా
మ్రింగుడుపడకుంది
ఎంతటి అమానుషత్వం
ఎంతటి ఆటవికత్వం
ఎంతటిఅనైతికత్వం
మానవత్వం మంటగలసినక్షణం
మనిషి మన్యజంతువుగ
మారిపోయిన వైనం
రక్కసిమూకల కర్కశక్రీడలో
ముక్కలుచెక్కలైన
ముక్కుపచ్చలారని బాల్యం
కనులారా కాంచి కూడా
కదలిరాని ఆదైవం
సభ్య సమాజం తలలు
పాతాళానికి దించుకొనే
అతిభయానక క్షణం తలచుకొంటేనే తల్లడిల్లిపోతోంది
ప్రతీ కన్నతల్లి హృదయం
ఆడబిడ్డకు రక్షణలేని
రాకాసి సమాజంలో
జన్మనివ్వాలంటే
అమ్మ జడుసుకుంటుంది
కంటికిరెప్పలా
కాచుకొంటున్నా
వెంటాడివేటాడి
కాలనాగులై కాచి
కాటేస్తుంటే
కన్నులెదుటే
కన్నబిడ్డల
ఖననం గావిస్తుంటే
భగభగమండే
కడుపుకోతకు
బదులేంచెప్పాలి
మూణ్ణాళ్ళ ముచ్చటై
ముగిసిపోతున్న
వసివాడినపసిపాపల
కన్నీటికధనాలకు
ఏంచేసి
ప్రాయశ్చిత్తంచేయాలి
ఆ కామాంధుల
నట్టనడివీధిలో
నిలబెట్టి ఉరితీయాలా
బ్రతికుండగానే
భగభగమండే నిప్పుల్లో
తగలెట్టాలా...

సాలిపల్లిమంగామణి(శ్రీమణి)

13, ఏప్రిల్ 2018, శుక్రవారం

*అమ్మ* కన్నీటి *చెమ్మ*

*అమ్మ* కన్నీటి *చెమ్మ*

ఆమాతృమూర్తికేంతెలుసు..?
తనుతరిమివేయబడ్డానని
కన్నకడుపుకేం తెలుసు...?
కన్నబిడ్డలు కటికపాషాణాలని
కలనైనా అనుకొంటుందా..?
ఎన్నో కలలుగని కన్న తనయులే వీధికీడుస్తారని
నడిరాతిరి నడివీధికుప్పతొట్టికి
తనను కాననుకిస్తారని
అరక్షణంలో వస్తానని
నమ్మబలికి ఆమడదూరంలో
ఆరుబయటే వదిలేసి
వెనుదిరిగి చూడకున్నా...
నీరెండిన కళ్ళతో
నిరీక్షిస్తున్న
ఆ అమ్మనుచూస్తే
అమ్మతనం మూగబోయింది
ఆకాశం గుండె బ్రద్దలయింది
నేలతల్లి సైతం పాలుపోక చూస్తుంది..
కన్నబిడ్డల కసాయిచర్యను
కానుకోలేక
కన్నీరుమున్నీరుగా
విలపిస్తున్న
ఆకారుణ్యమూర్తిని గాంచి,
కదలలేని స్ధితిలో
కడుదీనస్ధితిలో
మురికిజీవాలు
ముసురుకొని
రక్తమాంసాలు పీల్చి
శరీరంపై స్వైరవిహారం
చేసి,దొరికినంతా దోచుకొంటున్నా...
వాటిని అదిలించడానికి
సైతం కదిలే సత్తువలేక
నిశ్చేతనయై
నిరీక్షిస్తూనే వుంది....
అరక్షణంలో ...వస్తానని
తరలెల్లిన తనయుడు
ఏక్షణాన వస్తాడో...నని
కమ్మని అమ్మతనం మాత్రం
కనురెప్పేయక కాచుకొనేవుంది
కన్నబిడ్డరాకకోసం...
చావుబ్రతుకుల పోరాటంలో
చివరి మజిలీ చేరుకున్నా..
ఆకలిదప్పులు మరచినా
కడుపుతీపిని మాత్రం
కడదాకా దాచేవుంచి
కన్నప్రేగు బంధాన్ని త్రెంచుకోలేక,
దారి మరచిపోయాడో,ఏమో ...
పిచ్చిసన్నాసి అనుకొంటూ...
ఏ దారిన మీరెల్లినా !
మావాడి జాడ కనిపిస్తే
ఈ అమ్మకప్పగించండి
అందాకా కనురేప్పేయక
కాచుకొనే ఉంటా ,
కదలలేని నేను
మృత్యు వొచ్చి కభళిస్తానన్నా...
నా బిడ్డను చూసేవరకు
నువు వేచే ఉండమని  మొరాయిస్తానంటూ ..
ఆ అమ్మ తన కన్నీటిచెమ్మలో కన్నబిడ్డ ప్రతిబింబం పదిలం గావిస్తూ...
వదిలేసింది,వదులై పోయిన
ఆ అమ్మ జన్మను,
అమ్మతనాన్ని ,అనురాగాన్ని
అమరం చేస్తూ ..
కమ్మనైన అమ్మఆత్మ కాలగర్భంలో కలిసిపోయింది సమరం చేయలేక
పైశాచికతనయుడిపై,
తనువే చాలించింది ,
అదే నడివీధి కుప్పతొట్టిదరి
ఎదురుచూపుల ఎండమావిపై..

( కదలలేని స్ధితిలో ఉన్న
  కన్నతల్లిని కల్లబొల్లి
మాటలుచెప్పి కారులో
తీసుకొచ్చి నడివీధిలో
  కూర్చోబెట్టి ఇప్పుడే
వస్తానని మాయమైపోయిన
ఒక నయవంచకుడైన
కొడుకునిర్వాకం..ఆకొడుకు వస్తాడనినడివీధిలోనే ఎదురుచూస్తూ
తనువుచాలించిన ఆకన్నతల్లి
ధౌర్భాగ్యం...ఒకనాటి దినపత్రికలో చూసిచలించి
రాల్చిన నా అక్షరాశ్రవులు)
             సాలిపల్లిమంగామణి(శ్రీమణి)

3, ఏప్రిల్ 2018, మంగళవారం

మానవత్వం పరిమళించే

మాటలెందుకు?కోతలెందుకు?
తోటివాడికి సాయపడితే
కోటి ఫలముల మూటగాదా !
జపములెందుకు?తపములెందుకు? పేదవారికి చేయూతనిస్తే చెంతరాదా! కోరి మోక్షము.
భజనలెందుకు?కీర్తనలెందుకు?
భక్తి గుండెల నిండినప్పుడు ..
దేవుడెరుగడా...మన గుండెచప్పుడు.
మనిషిమనిషిలోమానవత్వం పరిమళిస్తే...మాన్యమవదా...మన వ్యవస్ధ తధ్యం.
ప్రతీ ఒక్కరు స్పందిస్తే ప్రపంచమే మారదా...పట్టువీడక ప్రయత్నిస్తే పసిడి పండదా....బీడుభూమిలో....
                                           శ్రీమణి