పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

19, జూన్ 2014, గురువారం

అమ్మా ... మన్నించు


నేటి స్వంతత్ర భారతమా ... 
అవినీతికి,అన్యాయానికి  ఆలవాలమా ?
ప్రజాస్వామ్య  దేశమా 
ప్రజల పాలిట శాపమా ... 
విన్నావా .. సగటు జీవి ఆర్తనాదాలు 
కన్నావా .. కన్నీటి కధనాలు ?
మరచినావా .. మానవత్వం 
నేర్చినావా .. పైశాచికత్వం ?
కలచివేసే బ్రతుకులే కన్నులకగుపిస్తున్నా 
కాలానికి వదిలేసి కళ్ళు మూసుకొంటున్నావా 
తెల్ల దొరల కాలంలో బానిస బ్రతుకైనా బ్రతికాం 
నేటి ప్రజాస్వామ్య  వ్యవస్థలో బ్రతుకే బరువాయె కదా .. 
అణువణువున స్వార్ధంతో అల్లాడుతున్న వ్యవస్థ 
మంచం లేచిన మొదలు లంచమే లాంచనమాయె . 
పాపాయి పాల డబ్బాలో కల్తీ , ప్రాణం పోసే మందులలో కల్తీ 
తల్లి పాలు తప్ప కల్తీ లేనిదేది ?ఈ  లోకంలో 
నిత్యావసరాల ధరలు నిత్యం వేధిస్తుంటే 
నల్ల ఖజానాలు మాత్రం నింగికెగసిపోయెనా ?
వెల పెరిగిన వేగంతో నెల జీతం పెరగదేం ?
అవ్వల ,తాతయ్యల పించనులో లంచం 
బడుగు జీవి పధకాలలో లంచం 
ఎక్కడ చూసినా .. లంచం .. లంచం .. లంచం 
దీనికి లేదా అంతం ?
మన నుండే ప్రతి మార్పూ రావాలి 
అది సమాజాన్ని శాసించే తుది తీర్పు కావాలి 
ప్రక్షాళన చేసేద్దాం పాతుకుపోయిన పాపాన్ని 
విమోచన కల్పిద్దాం బ్రష్టు పట్టిన జాతికి 
కూకటి వేళ్ళతో పెకలిద్దాం .. అవినీతి కలుపు మొక్కల్ని 
చేయి చేయి కలిపి అవినీతి రహిత సమాజాన్ని నిర్మిద్దాం ... 
ప్రజాస్వామ్యం పరువు నిలబెడదాం .. . 
భారత పౌరులమైనందుకు
 మన జన్మభూమి ఋణం తీర్చుదాం (నిరతంతరం నిజాయితీ గా జీవిద్దాం )
                                                       సాలిపల్లిమంగా మణి @శ్రీమణి 
                          

          

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి