పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

21, మే 2018, సోమవారం

యద్ధనపూడిసులోచనారాణి కి శ్రద్ధాంజలి

🌹తెలుగు సాహితీ లోకంలో మెరిసిన మహిళామణిదీపం
తెలుగు నవలారచనలలో
అత్యున్నత శిఖరం
అద్భుతకధలను ఆంధ్రావనికందించిన
అమృతకలశం
ఆమె..కలం అజరామరం
ఆమెకధలు కరతలామలకం
ఆమే మన సుప్రసిద్ధ
నవలాసామ్రాజ్యాధినేత్రి
యద్ధనపూడి సులోచనారాణి
మద్యతరగతి మగువలను
తనకలంతో కలల అలలపై
తేలియాడించి,
మద్యతరగతిజీవితాలను
కధావస్తువులుగా...
సగటుజీవితాలకు సజీవసాక్ష్యాలుగా..
కడురమ్యమైన రచనలుచేసి
అశేష ఆంధ్రావనినీ తన రచనల రసాస్వాదనలో
ఓలలాడించి...
కుటుంబసంబంధాలు,
భార్యాభర్తల అనుబంధాలు,
మద్యతరగతి మగువల
వ్యక్తిత్వం,ఆత్మాభిమానం
ఆమెరచనలలో ప్రతిబింబించి
మూడుతరాలపాఠకులను మంత్రముగ్ధులనుగావించి....
రచనాప్రక్రియను
తనదైనశైలిలో కొత్తపుంతలుతొక్కించిన యావత్ నవలా చరిత్రకే
కలికితురాయి,ఆమె
నిన్నటి రచయిత్రి అయినా
నేటికీ ఆమెరచనలు టీవీసీరియళ్ళరూపంలో
ప్రేక్షకుల అభిమానాన్ని
చూరగొంటున్నాయంటే
ఆమె కలం సిరాను బదులు
మన మానసరాగాలను నింపుకొందేమో..అనిపిస్తుంది
ఆవిడను కనులారా..
చూసే భాగ్యం నాకు
కలగలేదు గానీ..
నాచిన్నప్పుడు
మాఅమ్మగారు ఆమెకు అభిమాని,మాఅమ్మగారు ఆవిడనవలలు ఒక్కటికూడా విడవకుండా చదివి
మానాయనమ్మగారికి వినిపించేవారు
ఆక్రమంలోఅది విన్న నేను ఒకవిధమైనమధురమైన అనుభూతికిలోనయ్యేదాన్ని,
అలాచిన్నతనంలోనే ఆమెరచనలపట్ల ఆకర్షితురాలయ్యాను..
ఆవిడరాసిన ఎన్నోకధలను ధారావాహికరూపంలో
చూసిన,చూస్తున్న మనమందరం ధన్యులమే
మధురకధలను పదిలపరచి
గగనసీమకు పయనమైనా
పదిలమేగా పదితరాలకూ
తెలుగువారి హృదయాలలోన
ఆవిడను ఎప్పటికైనా
కలిసి మాట్లాడాలనే నాఆశ
తీరనేలేదు..కానీ ఆ
మహారచయిత్రిని గురించి
మాట్లాడడానికి అర్హతలేని
అణువంతదాననైనా..
ఆమె ఆత్మకు శాంతిని,మోక్షాన్ని ప్రసాదించాలని ఆభగవంతుని
మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నా🌹....శ్రీమణి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి