శ్రీశ్రీ నాటిన అభ్యుదయ
  సాహితీ వనంలో .. 
నే గడ్డిపూవునయినను చాలు 
ఆ రేడు నడిచిన దారిలో......
ఇసుక రేణువునయినను చాలు 
ఆ అభీకుని కలం విదిల్చిన
 సిరా బొట్టు నయిననూ  చాలు 
ఆ మహనీయుని కలానజారిన కవనంలో ....... 
నేనొక అక్షరమయిననూ చాలు 
ఆ దార్శనికుని కవితా కడలిలో   చిన్ని అలనయినా చాలు 
భాదిత జనాల బాసట  నిలువగ,
పీడిత జనాలకూపిరులూదగ ,
కవి తలపెట్టిన మహాయజ్ఞం
 కొనసాగించుటకై ,
నే ఉడత సాయమందిస్తా ... 
సమ సమాజ స్థాపనలో ,నా
 చిరు కవితాబాణం సంధిస్తా .... 
(మహాకవిశ్రీశ్రీగారిజయంతిసందర్భంగా నివాళులర్పిస్తూ....)
                
                              శ్రీమణి
పచ్చని చేలు, పెద్ద చెరువు, పచ్చికల పైరగాలులు , కమ్మని ఊరగాయలు (పచ్చడులు), మామిడి తాండ్ర, మా ఊరు........
30, ఏప్రిల్ 2018, సోమవారం
శ్రీ శ్రీ గారి జయంతి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
 
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి